నేడు న్యాయవాదులు విధుల బహిష్కరణ | today lawyers boycott | Sakshi
Sakshi News home page

నేడు న్యాయవాదులు విధుల బహిష్కరణ

Feb 3 2017 12:33 AM | Updated on Sep 5 2017 2:44 AM

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించాలని, న్యాయవాదుల సంక్షేమ నిధి రూ.3లక్షల నుంచి రూ.5 లక్షలు పెంచాలనే డిమాండ్‌తో శుక్రవారం విధులను బహిష్కరించనున్నట్లు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.చాంద్‌బాషా తెలిపారు.

- ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌
కర్నూలు(లీగల్‌): నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించాలని, న్యాయవాదుల సంక్షేమ నిధి రూ.3లక్షల నుంచి రూ.5 లక్షలు పెంచాలనే డిమాండ్‌తో శుక్రవారం విధులను బహిష్కరించనున్నట్లు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.చాంద్‌బాషా తెలిపారు. గురువారం ఆయన అధ్యక్షతన బార్‌ అసోసియేషన్‌ సమావేశమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక హోదాను ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సీవీ శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు అనిల్‌కుమార్, తిరుపతయ్య, పుల్లారెడ్డి, గీతామాధురి, అబ్దుల్‌ కరీం తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement