ఆపరేషన్ అనగానే రోగికి గుర్తొచ్చేది విపరీతమైన బాధ. దాన్ని పోగొట్టే ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించేది మత్తువైద్యులు. వారు లేని వైద్యచికిత్స అన్నదే అసలు ఊహించుకోలేనిది. అమెరికాలో ఒక రోగికి దవడలోని కణితి తొలగించే పక్రియలో మెసచూస్ట్స్ జనరల్ ఆసుపత్రిలో చరిత్రలో తొలిసారిగా 16 అక్టోబర్ 1846లో ‘ఈథర్’ అనే మత్తుమందును ఉపయోగించి శస్త్రచికిత్స చేశారు. అప్పటినుంచి ఆ రోజ
-
శస్త్రచికిత్సలో మత్తుదే కీలకపాత్ర
-
నేడు ప్రపంచ మత్తువైద్యుల దినోత్సవం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
ఆపరేషన్ అనగానే రోగికి గుర్తొచ్చేది విపరీతమైన బాధ. దాన్ని పోగొట్టే ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించేది మత్తువైద్యులు. వారు లేని వైద్యచికిత్స అన్నదే అసలు ఊహించుకోలేనిది. అమెరికాలో ఒక రోగికి దవడలోని కణితి తొలగించే పక్రియలో మెసచూస్ట్స్ జనరల్ ఆసుపత్రిలో చరిత్రలో తొలిసారిగా 16 అక్టోబర్ 1846లో ‘ఈథర్’ అనే మత్తుమందును ఉపయోగించి శస్త్రచికిత్స చేశారు. అప్పటినుంచి ఆ రోజును ప్రపంచ మత్తువైద్యుల దినోత్సవంగా జరుపుకొంటున్నారు.
బాధ లేకుండా..
మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ పూర్తిచేయడమే కాదు తర్వాత బాధ లేకుండా చూడడం మత్తు వైద్యుల బాధ్యత. అయితే.. మత్తు మందు ఇస్తే శాశ్వత కోమాలోకి వెళ్లిపోతామని, నడుం నొప్పి వస్తుందని, తర్వాత పనిచేసుకోలేని విధానం ఏర్పడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవన్నీ కేవలం అపోహలేనని మత్తువైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ పదుల సంఖ్యలో శస్త్రచికిత్సలు, ఆపరేషన్ థియేటర్లో గంటల తరబడి పనిచేయడం కారణంగా వారు పలు అనారోగ్యాల బారిన పడుతున్నారు.
అవగాహన కార్యక్రమాలు
రోగుల్లో మత్తుమందుపై ఉన్న అపోహ లు పొగొట్టేందుకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, సుగర్, గుండెవ్యాధులు, అస్తమా, రొంప, దగ్గు, నోటిలో కట్టుడుపళ్లు, వదులు పళ్లు ఉన్నా వైద్యులకు తప్పనిసరిగా తెలియజేయాలి. జిల్లాలో అన్ని ఆస్పత్రుల్లో 200 మంది మత్తు వైద్యులు నిత్యం సేవలందిస్తున్నారు. వీరం తా రోజుకి 700 పైగా శస్త్రచికిత్సల్లో పాల్గొంటారు.
ప్రాథమిక చికిత్సపై..
ప్రపంచ మత్తువైద్యుల దినోత్సవం సందర్బంగా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా> రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్తీయలాజిస్ట్, ఐఐఈఎమ్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆ సంస్థ స్టేట్ సెక్రటరీ డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ రెడ్డి ప్రసాద్, డాక్టర్ బ్రహ్మాజీలు పోలీస్ సిబ్బందికి ప్రాథమిక చికిత్సలో అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో చేయాల్సిన వైద్యం, సత్వర చర్యలను వివరించారు.