అమ్మ కటాక్షం కోసం అక్షర శ్రీకారం! | Thousands of devotees to visit Basara piligrim | Sakshi
Sakshi News home page

అమ్మ కటాక్షం కోసం అక్షర శ్రీకారం!

Jun 12 2016 7:54 PM | Updated on Sep 4 2017 2:20 AM

బాసర అమ్మవారి క్షేత్రం ఆదివారం భక్త జనం సందోహంతో నిండిపోయింది.

బాసర(ఆదిలాబాద్ జిల్లా): బాసర అమ్మవారి క్షేత్రం ఆదివారం భక్త జనం సందోహంతో నిండిపోయింది. సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ చిన్నారులను తల్లిదండ్రులకు జ్ఞాన సరస్వతీ క్షేత్రంలో అక్షర శ్రీకారం చేయించారు. ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.

అమ్మవారి దర్శనానికి సుమారు 3గంటల సమయం పట్టింది. 20 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 876 మంది చిన్నారులకు అక్షర శ్రీకారం జరిపించారు. అమ్మవారి ఆలయానికి సుమారు రూ.4లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement