రామలక్ష్మణుల పంచలోహ విగ్రహాల చోరీ | The theft of deities in rangareddy | Sakshi
Sakshi News home page

రామలక్ష్మణుల పంచలోహ విగ్రహాల చోరీ

Nov 14 2015 8:54 PM | Updated on Aug 11 2018 8:48 PM

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది.

షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు గర్భగుడి ఆలయం తలుపులు తెరిచి రామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి ఆలయ పరిసరాలను పరిశీలించారు. జాగిలాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. ఇదే ఆలయంలో 15 ఏళ్ల క్రితం కూడా విగ్రహాలను దొంగలు ఎత్తుకుపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement