వడదెబ్బకు కుప్పకూలిన విద్యార్థి | the student died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు కుప్పకూలిన విద్యార్థి

Apr 25 2016 6:03 PM | Updated on Sep 3 2017 10:43 PM

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో ఓ యువకుడు వడదెబ్బకు మృతి చెందాడు.


పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో ఓ యువకుడు వడదెబ్బకు కుప్పకూలిపోయాడు. ద్వారకా తిరుమలకు చెందిన కనికిచర్ల మణికంఠ (20) స్థానికంగా కూల్‌డ్రింక్ షాపు నడుపుతున్న తల్లి లక్ష్మికి సాయంగా ఉంటూనే ప్రైవేటుగా డిగ్రీ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్ తెచ్చుకుందామని సోమవారం భీమడోలులోని తన కళాశాలకు వెళ్లాడు.

 

తిరుగు ప్రయాణంలో భీమడోలు జంక్షన్‌లో బస్సు కోసం వేచి ఉండగా... ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి అతని వద్దనున్న సమాచారం ఆధారంగా తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పారు. లక్ష్మి భర్త రెండేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉండగా మణికంఠ పెద్దవాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement