తిరుపతిలో జంట హత్యలు | Twin assassinations in Tirupati on Wednesday night | Sakshi
Sakshi News home page

తిరుపతిలో జంట హత్యలు

Jul 9 2026 5:34 AM | Updated on Jul 9 2026 5:34 AM

Twin assassinations in Tirupati on Wednesday night

వెంటాడి వేటాడి నరికి చంపిన దుండగులు

తిరుపతి క్రైం: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపం సముదాయంలో బుధవారం రాత్రి జంట హత్యలు కలకలం రేపాయి. ఒక మహిళతో పా­టు నలుగురు వ్యక్తులు వెంటాడి వేటాడి కత్తు­లతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో జీవ­కోన ప్రాంతానికి చెందిన మునిరత్నం(50) ఘట­నా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయ­పడి­న సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన మణికంఠ­(41)­ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందు­తూ ప్రాణాలు విడిచాడు. పోలీసు­లు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మావతి కళ్యా­ణ మండపం సముదాయంలో నాలు­గు కళ్యాణ మండపాలున్నాయి. 

బుధవా­రం రాత్రి ఒక మండపంలో వివాహం జరు­గు­తోంది. రాత్రి 9.30 గంటల సమయంలో కొందరు దుండగులు రెండు బైక్‌లపై అక్కడికి చేరుకున్నారు. కల్యాణ మండపం సముదాయంలో­ని నిర్మా­ను­ష్య ప్రాంతంలో మునిరత్నం, మణికంఠపై వారు దాడి చేశారు. మునిరత్నం, మణికంఠ చిరు­వ్యా­పా­రులు. మునిరత్నం రెండు నెలల కిందట ఓ వివా­హం జరిపించాడు. దాని నేపథ్యంలో ఏర్ప­డి­న వివాద­మే ఈ దారుణానికి దారితీసి ఉండొచ్చ­ని పోలీ­సులు భావి­స్తున్నా­రు. దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా, ఘటన­లోని కొన్ని దృశ్యాలను పద్మావతి కళ్యాణ మండపంలో విధులు నిర్వర్తిస్తున్న వాచ్‌­మన్‌ తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించినట్టు తెలిసింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement