కరీంనగర్ జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో వడదెబ్బ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు.
కరీంనగర్ జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో వడదెబ్బ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. 43వ డివిజన్ పరిధిలోని అల్లూరు గ్రామానికి చెందిన బాదే చిన్న ఎల్లయ్య (60) పనుల కోసం ఆదివారం బయటకు వెళ్లాడు. ఎండ కారణంగా అస్వస్థత పాలయ్యాడు. అర్ధరాత్రి ఇంట్లో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.