నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా, మరో మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా, మరో మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. చిత్తాపూర్ గ్రామానికి చెందిన వసంత (29) శనివారం రాత్రి మృతి చెందగా ఆదివారం విషయం బయటకు వచ్చింది. భర్త కుటుంబీకులే హత్య చేశారని వసంత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో మండలంలోని నల్లూరు గ్రామానికి చెందిన లలిత (40) శనివారం నుంచి కనిపించకుండా పోయింది. ఆదివారం గ్రామంలోని ఓ బావిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.