స్వామి వారిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు | The Minister harishrao in yadadri | Sakshi
Sakshi News home page

స్వామి వారిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు

Jul 31 2016 11:14 PM | Updated on Aug 30 2019 8:37 PM

స్వామి వారిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు - Sakshi

స్వామి వారిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారిని ఆదివారం భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారిని ఆదివారం భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు.  ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈఓ గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకుడు కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు చింతపట్ల రంగాచార్యులు, సురేంద్రాచార్యులు, మంగళగిరి నరసింహామూర్తి, అధికారులు దోర్భల భాస్కరశర్మ, గోపాల్, వేముల వెంకటేశ్‌ పాల్గొన్నారు. 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement