పచ్చ నేతల 'కెవ్వు కేక' | tdp leaders hulchul in west godavari district | Sakshi
Sakshi News home page

పచ్చ నేతల 'కెవ్వు కేక'

Mar 23 2016 9:31 AM | Updated on Aug 10 2018 9:42 PM

వేదికపై డాన్సర్లతో కలసి చిందులేస్తున్న టీడీపీ నేతలు - Sakshi

వేదికపై డాన్సర్లతో కలసి చిందులేస్తున్న టీడీపీ నేతలు

అధికారం దన్నుతో అడ్డగోలు సంపాదన.. అక్రమ వసూళ్లు తెచ్చిపెట్టిన నడమంత్రపు సిరితో హల్‌చల్ చేస్తున్న టీడీపీ నేతల్లో కొందరు ఉంగుటూరు మండలం కైకరం ప్రాంతంలో అశ్లీల నృత్యాలతో అంటకాగారు.

  • అశ్లీల నృత్యాలతో హల్‌చల్
  • డ్యాన్సర్లతో తాగి తందనాలు
  •  
    ఏలూరు: అధికారం దన్నుతో అడ్డగోలు సంపాదన.. అక్రమ వసూళ్లు తెచ్చిపెట్టిన నడమంత్రపు సిరితో హల్‌చల్ చేస్తున్న టీడీపీ నేతల్లో కొందరు ఉంగుటూరు మండలం కైకరం ప్రాంతంలో అశ్లీలనృత్యాలతో అంటకాగారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. ఉంగుటూరు, కైకరం ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతల్లో కొందరు ఇటీవల విచ్చలవిడిగా ఓ పార్టీ చేసుకుందామనుకున్నారు.
     
    అనుకున్నదే తడవుగా మందు, విందు సిద్ధం చేసుకున్నారు. ఈ రెండు ఎప్పుడూ ఉండేవే.. మహిళా డ్యాన్సర్లను తీసుకొచ్చి చెలరేగిపోదామని ఓ టీడీపీ నేత సలహా ఇచ్చాడు. అంతే తూర్పుగోదావరి జిల్లా నుంచి ముగ్గురు మహిళా డ్యాన్సర్లను తీసుకొచ్చారు. కైకరంలోని ఓ అట్టల ఫ్యాక్టరీలో రాత్రి పూట రికార్డింగ్ డ్యాన్సుల మోత మోగించారు.

    అశ్లీల నృత్యాలతో బరితెగించారు. బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా కేవలం ఎంపిక చేసిన ఓ 30 మంది కార్యకర్తలను మాత్రమే లోనికి అనుమతించారు. తెలుగు యువత నాయకుడి ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాకు టీడీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి, మాజీ సర్పంచ్, ఓ ప్రజాప్రతినిధి సోదరుడు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. రాత్రి 10 గంటలకు మొదలైన మేళాను తెల్లవార్లూ కొనసాగించారు.
     
    ఆ రోజు జరిగిన డ్యాన్సుల మేళాను చిత్రీకరించిన ఓ ఔత్సాహికుడు ఆ వీడియోను ‘సాక్షి’కి పంపించడంతో టీడీపీ నేతల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆ మధ్యన  ఏలూరులో టీడీపీ కార్పొరేటర్లు ‘ఆట కావాలా.. పాట కావాలా’ అంటూ చిందులేసిన వైనాన్ని జనం మరచిపోకముందే కైకరంలో ‘పచ్చ’నేతలు చేసిన అశ్లీల నృత్యాలు ఉదంతం వారి దిగజారుడు మనస్తత్వాలను బయటపెట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement