చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన తమ్ముళ్లు | tdp leaders attacks on villagers in chittoor district | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన తమ్ముళ్లు

Dec 24 2015 5:35 PM | Updated on Aug 10 2018 9:42 PM

చిత్తూరుజిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల దాడులతో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తిరుపతి: చిత్తూరుజిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల దాడులతో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేణిగుంట మండలం కొట్రమంగళం టీడీపీ గ్రామసర్పంచ్ దామోదర రెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ దామోదర రెడ్డి చెక్ పవర్ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు చేసిన గ్రామస్తులపై సర్పంచ్ వర్గీయులు దాడులకు తెగబడ్డారు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement