ముకరంపుర :గుండెపోటుతో మృతిచెందిన మెట్పల్లి తహసీల్దార్ వి.నరేందర్కు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. కరీంనగర్లోని ఖార్ఖానాగడ్డలోని ఆయన నివాసానికి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు చేరుకుని మృతదేహం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.
తహసీల్దార్ నరేందర్కు కన్నీటì వీడ్కోలు
Jul 23 2016 11:32 PM | Updated on Mar 21 2019 8:35 PM
ముకరంపుర :గుండెపోటుతో మృతిచెందిన మెట్పల్లి తహసీల్దార్ వి.నరేందర్కు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. కరీంనగర్లోని ఖార్ఖానాగడ్డలోని ఆయన నివాసానికి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు చేరుకుని మృతదేహం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఖార్ఖానాగడ్డలోని శ్మశాన వాటికలో మధ్యాహ్నం అంత్యక్రియలు ముగిశాయి. కలెక్టర్ నీతూప్రసాద్, జేసీ శ్రీదేవసేన, ఏజేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య, జగిత్యాల సబ్కలెక్టర్ శశాంక, కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్, సిరిసిల్ల ఆర్డీవో శ్యాంసుందర్, వరంగల్ ఆర్డీవో వెంకటమాధవ్ తదితరులు నివాళులర్పించారు. తహసీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాÄæూస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్, కార్యదర్శి సుగుణాకర్రెడ్డి, పెన్షనర్స్ సంఘం నాయకులు నర్సయ్య, కేశవరెడ్డి తదితరులు నివాళులర్పించారు.
Advertisement


