సుమో బోల్తా : ఇద్దరి మృతి | sumo fallen in ysr district two died | Sakshi
Sakshi News home page

సుమో బోల్తా : ఇద్దరి మృతి

Feb 7 2016 7:21 PM | Updated on Aug 25 2018 6:06 PM

వైఎస్సార్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

కలసపాడు : వైఎస్సార్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.  కలసపాడు మండలం పిడుగుపల్లి సమీపంలో ఓ సుమో ప్రమాదవశాత్తూ బోల్తాపడింది.

ఈ ఘటనలో శశికుమార్(17), పద్మజ(16) అనే ఇద్దరు ఇంటర్ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement