వైఎస్సార్ జిల్లా రాజంపేట ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం ఓ సూట్కేసు కలకలం రేపింది.
వైఎస్సార్ జిల్లా రాజంపేట ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం ఓ సూట్కేసు కలకలం రేపింది. తెల్లవారుజామున ఎవరో ఓ సూట్ కేసును విడిచి వెళ్లడంతో అందులో ఏముందోనన్న భయంతో ప్రయాణికులు హడలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సూట్కేసును స్వాధీనం చేసుకున్నారు. అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.