కాల్‌ చేశారు: లక్ష కొట్టేశారు | Rs.lakh escaped from fake call | Sakshi
Sakshi News home page

కాల్‌ చేశారు: లక్ష కొట్టేశారు

Aug 4 2015 6:28 PM | Updated on Sep 3 2017 6:46 AM

ఏటీఎం కార్డు కాలపరిమితి ముగిసిపోయింది.

కరీంనగర్: ఏటీఎం కార్డు కాలపరిమితి ముగిసిపోయింది. కార్డుకు సంబంధించి పూర్తి వివరాలు తెలపండని ఫోన్ చేసి అకౌంట్‌లోని డబ్బులు కాజేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా పెదపల్లి ఐటీఐ కాలేజీలో మంగళవారం వెలుగుచూసింది. పెదపల్లి ఐటీఐ కాలేజీలో పనిచేసే నందగోపాల్‌కు దుండగులు ఫోన్‌ చేసి కార్డు వివరాలు తీసుకుని అతడి అకౌంటు నుంచి రూ. 66 వేలు కాజేశారు.  అనంతరం మరో సారి కాల్ చేసి నగదు తప్పుగా జమ అయ్యాయని మరో కార్డు వివరాలు చెబితే అందులోకి బదిలీ చేస్తామని నమ్మబలికారు. ఇలా నలుగురి వివరాలు తీసుకుని రూ. లక్ష పై చిలుకు దొచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement