ఆర్టీసీకి రూ.15 లక్షల నష్టం | rs.15 lakhs loss for rtc | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి రూ.15 లక్షల నష్టం

Nov 28 2016 11:50 PM | Updated on Sep 4 2017 9:21 PM

రోడ్డు రవాణ సంస్థపై హర్తాళ్‌ ప్రభావం కనిపించింది. బస్సులు 85శాతం మాత్రమే తిరగడంతో ఆర్టీసీకి రూ.15లక్షల నష్టం వచ్చినట్ల కర్నూలు రీజినల్‌ మేనేజరు జి. వెంకటేశ్వర రావు పేర్కొన్నారు.

కర్నూలు(రాజ్‌విహార్‌): రోడ్డు రవాణ సంస్థపై హర్తాళ్‌  ప్రభావం కనిపించింది. బస్సులు 85శాతం మాత్రమే తిరగడంతో ఆర్టీసీకి రూ.15లక్షల నష్టం వచ్చినట్ల కర్నూలు రీజినల్‌ మేనేజరు జి. వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ప్రతిపక్షాలు సోమవారం నిరసన నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం నుంచే పలు చోట్ల ఆందోళనకారులు బస్సులను నిలిపివేశారు. బయటకు వెళ్లిన బస్సులను సైతం రోడ్లపై ఆపేశారు. మధ్యాహ్నం తరువాత యథావిధిగా సర్వీసులన్నీ పునరుద్ధరణ అయ్యాయి.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement