బిస్కెట్లు ఇచ్చి దోచేశారు | robbery with biscuits in kk express | Sakshi
Sakshi News home page

బిస్కెట్లు ఇచ్చి దోచేశారు

Aug 19 2015 8:21 PM | Updated on Aug 30 2018 5:27 PM

బిస్కెట్లు ఇచ్చి దోచేశారు - Sakshi

బిస్కెట్లు ఇచ్చి దోచేశారు

మత్తు మందు చల్లిన బిస్కెట్లు ఇచ్చి నిలువు దోపిడీ చేసిన సంఘటన న్యూఢిల్లీ-కేరళ కేకే ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం చోటు చేసుకుంది.

విజయవాడ: మత్తు మందు చల్లిన బిస్కెట్లు ఇచ్చి నిలువు దోపిడీ చేసిన సంఘటన న్యూఢిల్లీ-కేరళ కేకే ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ స్టేషన్ వద్దకు రాగానే కొంతమంది ప్రయాణికులు రైల్లోకి ఎక్కారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ.. తోటి ప్రయాణికులకు బిస్కెట్లు ఇచ్చారు. ఆ బిస్కెట్లు తిన్నవారంతా నిద్రలోకి జారుకున్నారు. తర్వాత ఆ దుండగులు వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు.

ఇద్దరు దంపతులు మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌లో దిగాల్సి ఉండగా మత్తు మందు చల్లిన బిస్కెట్లు తినడంతో నిద్రలోనుంచి లేవలేకపోయారు. విజయవాడ వచ్చినా వారు నిద్రలేవకపోవటంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆరా తీయగా విషయం తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement