మత్తు మందు కలిపిన బాదం పాలు ఇచ్చి దోపిడీ | robbery in kerala express | Sakshi
Sakshi News home page

మత్తు మందు కలిపిన బాదం పాలు ఇచ్చి దోపిడీ

Aug 11 2016 4:06 PM | Updated on Aug 30 2018 5:27 PM

మత్తు మందు కలిపిన  బాదం పాలు ఇచ్చి దోపిడీ - Sakshi

మత్తు మందు కలిపిన బాదం పాలు ఇచ్చి దోపిడీ

రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి మత్తు మందు కలిపిన బాదం పాలు ఇచ్చి అతడిని నిలువు దోపిడీ చేసిన సంఘటన కేరళ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం జరిగింది.

  • కేరళ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సంఘటన
  • వరంగల్‌ జీఆర్‌పీలో బాధితుడి ఫిర్యాదు
  • రైల్వేగేట్‌ : రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి మత్తు మందు కలిపిన బాదం పాలు ఇచ్చి అతడిని నిలువు దోపిడీ చేసిన సంఘటన కేరళ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం జరిగింది. వరంగల్‌ జీఆర్‌పీ ఎస్సై ఎస్‌. శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. కరీంనగర్‌ పట్టణంలోని కట్టరాంపూర్‌కు చెందిన పారిపల్లి మనోహర్‌(42) ఈ నెల 9న ఢిల్లీ నుంచి కేరళ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఏ–2 కోచ్‌ 27వ బెర్త్‌లో వరంగల్‌కు వస్తున్నాడు. రైలు మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో భూపాల్‌ వరకు రాగానే ఇద్దరు వ్యక్తులు బోగీలోకి వచ్చారు. వారి చేతుల్లో వాటర్‌ బాటిల్, బాదం పాల బాటిల్‌ ఉన్నాయి.

    కొద్దిసేపటి తర్వాత ఆ ఇద్దరిలో ఒకరు వాటర్‌ తాగమని మనోహర్‌కు ఇవ్వగా తాగాడు. మరి కొద్దిసేపటికి మరొకరు తన వద్ద ఉన్న మత్తు మందు కలిపిన బాదం పాలు ఇచ్చాడు. అవి మనోహర్‌ తాగగానే వెంటనే మత్తులోకి జారుకున్నాడు. రైలు బుధవారం ఉదయం 10 గంటల సమయంలో రామగుండం రైల్వేస్టేషన్ వద్దకు రాగానే మనోహర్‌కు మెలకువ వచ్చింది. ఇంతలో తన వద్ద ఉన్న వస్తువులను చూసుకోగా కనిపించలేదు. తన వద్ద ఉన్న ఒక తులం బంగారు గొలుసు, రెండు తులాల బంగారు రింగులు, రూ.14 వేల విలువ కలిగిన వివో ఫోన్, రూ.18 వేల విలువైన ల్యాప్‌టాప్, రూ.3 వేల విలువైన మూడు చీరెలను దొంగలు అపహరించినట్లు బాధితుడు రైలు వరంగల్‌లో ఆగినపుడు వరంగల్‌ జీఆర్‌పీలో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌ చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement