కట్టేసి దోచేశారు! | robbery in highway | Sakshi
Sakshi News home page

కట్టేసి దోచేశారు!

Aug 17 2016 10:16 PM | Updated on Aug 30 2018 5:24 PM

సంఘటన వివరాలు చెబుతున్న లక్ష్మీనారాయణ - Sakshi

సంఘటన వివరాలు చెబుతున్న లక్ష్మీనారాయణ

దుండగులు టైరు పంక్చర్‌ దుకాణదారుడిని కట్టేసి సొత్తు అపహరించుకుపోయారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి అందోలు మండలం రాంసానిపల్లి జాతీయ రహదారిపై జరిగింది.

జోగిపేట: దుండగులు టైరు పంక్చర్‌ దుకాణదారుడిని కట్టేసి సొత్తు అపహరించుకుపోయారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి అందోలు మండలం రాంసానిపల్లి జాతీయ రహదారిపై జరిగింది. రాంసానిపల్లికి చెందిన సార లక్ష్మీనారాయణ ప్రధాన రహదారిపై టైర్ల పంక్చర్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఒంటరిగా అక్కడే గుడిసె వేసుకొని ఉంటున్నాడు.

ఇది గమనించిన ముగ్గురు దుండగులు మంగళవారం అర్ధరాత్రి లక్ష్మీనారాయణ నోరు మూసి పక్కనే ఉన్న పొలాల్లోకి ఎత్తుకెళ్లారు. ఆపై కాళ్లు, చేతులు కట్టేసి అతడి వద్ద ఉన్న 11 తులాల వెండి గొలుసు, ఉంగరం, గుడిసె తాళం చెవి లాక్కున్నారు. అనంతరం గుడిసెలోకి ప్రవేశించి రూ.2 వేలు, పెట్రోలు, గడియారం ఎత్తుకెళ్లారు. తర్వాత లక్ష్మీనారాయణ గ్రామపెద్దలకు ఫోన్‌ చేసి విషయం తెలిపాడు. ఘటనపై కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement