అన్నం తిన్న ఇంటికే కన్నం వేశాడు


మహబూబ్‌నగర్ : దొంగల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల ఇంట్లోనే దొంగలు పడి రూ. 25 తులాల బంగరు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు... కాలనీకి చెందిన వెంకట్రాములు మహిళా పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.


ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పరిచయస్థుడు రోడ్డు మీద కనిపించడంతో.. అతన్ని ఇంటకి పిలిచి భోజనం పెట్టించాడు. అనంతరం అత్యవసర పనిమీద వెంకట్రాములు భార్యతో కలసి బయటకు వెళ్లడంతో.. ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న 25 తులాల బంగారంతో ఉడాయించాడు. ఇంటికి తిరిగి వచ్చిన దంపతులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top