పెట్రోల్ కోసం వెళ్తుండగా.. | Road accident in Car collided | Sakshi
Sakshi News home page

పెట్రోల్ కోసం వెళ్తుండగా..

Jul 13 2016 1:54 AM | Updated on Aug 30 2018 4:07 PM

జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమందేపల్లిలోని ఇందిరానగర్‌కు చెందిన రవి(28) అక్కడికక్కడే మరణించగా...

సోమందేపల్లి/పెనుకొండ: జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమందేపల్లిలోని ఇందిరానగర్‌కు చెందిన రవి(28) అక్కడికక్కడే మరణించగా,  గీతానగర్ కు చెందిన బోయ నరేష్(24) తీవ్రంగా గా యపడ్డాడు. పెట్రోల్ వేయించుకోవడానికి బైక్‌పై బయలుదే రిన  యువకులు  జాతీయ రహదారి క్రాస్ చేస్తుండగా బెంగళూరు వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన కారు ఢీ కొనడంతో ఈ సంఘటన జరిగింది.  తీవ్రంగా గాయపడిన నరేష్‌ను మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement