అటవీ శాఖ అధికారులపై కూలీల రాళ్ల దాడి | Red sandalwood seized in kurnool district | Sakshi
Sakshi News home page

అటవీ శాఖ అధికారులపై కూలీల రాళ్ల దాడి

Nov 24 2015 8:02 AM | Updated on Sep 3 2017 12:57 PM

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి సమీపంలో అటవీశాఖ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు.

కర్నూలు : కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి సమీపంలో అటవీశాఖ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన 100కుపైగా ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ విషయాన్ని గమనించిన అక్కడే పొదల చాటున దాగి ఉన్న ఎర్రచందనం కూలీలు... అటవీశాఖ అధికారులపై రాళ్లతో దాడి చేశారు.

అనంతరం వారు అక్కడి నుంచి పరారైయ్యారు. వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ఎర్రచందనం కూలీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement