పవర్‌లూమ్ కార్మికుని ఆత్మహత్య | power loom worker commited suicide | Sakshi
Sakshi News home page

పవర్‌లూమ్ కార్మికుని ఆత్మహత్య

Aug 29 2016 7:38 PM | Updated on Sep 4 2017 11:26 AM

కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన తొర్ర ఎల్లయ్య(55) అనే పవర్‌లూం కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన తొర్ర ఎల్లయ్య(55) అనే పవర్‌లూం కార్మికుడు అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. గతకొన్నేళ్లుగా ఎల్లయ్య మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లకు వివాహం చేయగా, ఒక కుమార్తెకు విడాకులై ఇంటివద్దే ఉంటోంది. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లయ్య కుటుంబ అవసరాల కోసం రూ.5లక్షల దాకా అప్పు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని పోషించుకోలేక మనస్తాపం చెంది సోమవారం విషపదార్థం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement