
చిన్నారి మహేష్తో తల్లిదండ్రులు బుడ్డప్ప, నరసమ్మ.
బీద కుటుంబం..దారుణమైన వ్యాధి సోకింది. ఉన్నదంతా వైద్యానికి వెచ్చించినా నయంకాలేదు. మరణానికి చేరువవుతున్న బిడ్డను చూడలేక అతనికి కారుణ్యమరణానికి అనుమతించాలని తల్లిదండ్రులు అభ్యర్థించిన వైనం చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగంది.
అక్కడ వైద్యులు చికిత్సకు రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో నిశ్చేష్టుడయ్యాడు. ఏం చేయాలో పాలుపోలేదు. అంత డబ్బులు సమకూర్చలేక నరకయాతన అనుభవిస్తున్నాడు. మరోపక్క కళ్లెదుట కుమారుడు మృత్యువుకు దగ్గరవుతూ అవస్థ పడటాన్ని చూసి భరించలేకపోయారు ఆ దంపతులు. వైద్యం చేయించే స్తోమత లేని నిస్సహాయ స్థితిలో తమ బిడ్డకు కారుణ్యమరణానికి అనుమతించాలని ఈ దంపతులు శనివారం పుంగనూరులో న్యాయమూర్తి మోతీలాల్కు వినతిపత్రం అందజేశారు.
న్యాయమూర్తి మోతీలాల్ చలించిపోయారు. ఇందుకు అనుమతి ఇవ్వలేమని సున్నితంగా చెప్పారు. మండల న్యాయసేవా సమితి ద్వారా బిడ్డకు చికిత్స చేయించేందుకు న్యాయస్థానం చొరవ తీసుకుంటుందన్నారు. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఓదార్చి కాస్సేపు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ విషయమై న్యాయమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ఆనారోగ్యంతో బాధపడుతున్న మహేష్కు చికిత్స చే యించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.