భావి తరాల కోసం మొక్కలను నాటాలి | plantation for future | Sakshi
Sakshi News home page

భావి తరాల కోసం మొక్కలను నాటాలి

Jul 26 2016 1:27 AM | Updated on Sep 4 2017 6:14 AM

భావి తరాల కోసం మొక్కలను నాటాలి

భావి తరాల కోసం మొక్కలను నాటాలి

బీబీనగర్‌ : భావితరాల కోసం సామాజిక దృక్పథంతో ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కోరారు.

బీబీనగర్‌ : భావితరాల కోసం సామాజిక దృక్పథంతో ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కోరారు. సోమవారం కొండమడుగు గ్రామ పరిధిలోని రాగాల రిసార్ట్‌లో మండల పరిశ్రమల యాజమాన్యాలు, రియల్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో హరితహారంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాజమాన్యాలు తమ పరిశ్రమల్లోనే కాకుండా గ్రామాలను దత్తత తీసుకుని మొక్కలను నాటాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్‌ అశోక్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకయ్య, జెడ్పీటీసీ బస్వయ్య, వైస్‌ ఎంపీపీ లింగయ్యగౌడ్, సింగిల్‌విండో చైర్మన్‌ వాకిటి సంజీవరెడ్డి, ఎంపీటీసీలు మన్నె బాల్‌రాజు, చంద్రశేఖర్, సర్పంచ్‌లు ఇస్తారి, అంజయ్యగౌడ్, పాండు, రేణుక, జంగయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు బొక్క జైపాల్‌రెడ్డి, ఎరుకల సుధాకర్‌గౌడ్, పిట్టల అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement