రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో నిద్రిస్తున్న బాబు, సుగుణమ్మ దంపతులపై అర్థరాత్రి సమయంలో దాడిచేసి నగదు, ఆభరణాలను దోచుకుపోయారు. శుక్రవారం ఉదయం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సంఘటన స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు.