ఘనంగా తిరంగా దివాస్‌ | Patriotism | Sakshi
Sakshi News home page

ఘనంగా తిరంగా దివాస్‌

Aug 11 2016 9:54 PM | Updated on Nov 9 2018 4:51 PM

ఘనంగా తిరంగా దివాస్‌ - Sakshi

ఘనంగా తిరంగా దివాస్‌

పట్టణంలో తిరంగా దివాస్‌ ర్యాలీ గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నెహ్రుచౌక్‌ సెంటర్‌ నుంచి ఏలూరు రోడ్డు వరకు సాగిన ఈ ర్యాలీలో స్థానిక త్రివేణి పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన వేయ్యి మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొని 4000 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.

గుడివాడ టౌన్‌  (కృష్ణాజిల్లా) :
పట్టణంలో తిరంగా దివాస్‌ ర్యాలీ గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నెహ్రుచౌక్‌ సెంటర్‌ నుంచి ఏలూరు రోడ్డు వరకు సాగిన ఈ ర్యాలీలో స్థానిక త్రివేణి పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన వేయ్యి మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొని 4000 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు క్విట్‌ ఇండియా ఉద్యమం వజ్రోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిచినట్లుగా నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ అడపా వెంకటరమణ (బాబ్జీ) ప్రారంభించారు. కార్యక్రమంలో త్రివేణి పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌ ఎన్‌.శివశంకర్‌ పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement