ప్రభుత్వ ఆస్పత్రిపై బాధితుల దాడి | patients attack on hospital in chittoor district | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రిపై బాధితుల దాడి

Jul 9 2016 1:50 PM | Updated on Sep 4 2017 4:29 AM

ఆస్పత్రికి వైద్యులు రావడం లేదని ఆగ్రహించిన రోగులు ప్రభుత్వ ఆస్పత్రిపై దాడి చేశారు.

వి. కోట: ఆస్పత్రికి వైద్యులు రావడం లేదని ఆగ్రహించిన రోగులు ప్రభుత్వ ఆస్పత్రిపై దాడి చేశారు. చిత్తూరు జిల్లా వి.కోట ప్రభుత్వ ఆస్పత్రిలో గత ఆరు నెలలుగా వైద్యులు సరిగ్గా అందుబాటులో ఉండటం లేదని ఆగ్రహించిన బాధితులు శనివారం ఆస్పత్రిపై దాడి చేసి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. సుమారు వంద మంది ఆస్పత్రిపై దాడి చేశారు. ప్రైవేట్ ప్రాక్టీస్‌ల గోలలో పడి ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement