'వరంగల్ ప్రజలకు రుణపడివుంటా' | pasunuri dayakar thanks to warangal people | Sakshi
Sakshi News home page

'వరంగల్ ప్రజలకు రుణపడివుంటా'

Nov 24 2015 10:36 AM | Updated on Sep 3 2017 12:57 PM

'వరంగల్ ప్రజలకు రుణపడివుంటా'

'వరంగల్ ప్రజలకు రుణపడివుంటా'

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులే వరంగల్ లో తనను గెలిపిస్తున్నాయని టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ అన్నారు.

వరంగల్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులే వరంగల్ లో తనను గెలిపిస్తున్నాయని టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ అన్నారు. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో విజయం దిశగా దూసుకెళుతుండడంతో ఆయన కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించడం వల్లే భారీ మెజారిటీతో తాను గెలవబోతున్నట్టు చెప్పారు.

తనకు భారీ విజయాన్ని అందిస్తున్న వరంగల్ ప్రజలకు రుణపడివుంటానని అన్నారు. వరంగల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీయిచ్చారు. కేసీఆర్ తనపై పెద్ద బాధ్యత పెట్టారని అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement