నిలిచిన ట్రావెల్స్ బస్సు: ప్రయాణికుల ఇబ్బంది | passengers stranded due to Technical problem in private travels bus at jadcherla | Sakshi
Sakshi News home page

నిలిచిన ట్రావెల్స్ బస్సు: ప్రయాణికుల ఇబ్బంది

Oct 15 2015 9:12 AM | Updated on Apr 7 2019 3:28 PM

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో బుధవారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.

మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో బుధవారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో బస్సు డ్రైవర్ ప్రయాణీకులను రహదారిపై దింపివేశాడు. తమను మరో బస్సులో హైదరాబాద్ చేర్చాలని ప్రయాణీకులు... యాజమాన్యానికి విజ్ఞప్తి చేసిన వారి నుంచి స్పందన కరువైంది.

దాంతో ప్రయాణీకులకు ప్రత్యామ్నాయం చూపక పోవడంతో వారంత గత ఆర్థరాత్రి నుంచి రహదారిపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకులు రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ బస్సు ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్ వస్తుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement