పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కందిపప్పు ప్రత్యేక విక్రయ కౌంటర్ను శుక్రవారం రైతుబజారు ఈవో స్వప్న ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వనస్థలిపురం రైతుబజారులో ఏర్పాటుచేసిన కందిపప్పు ప్రత్యేక విక్రయ కౌంటర్ను శుక్రవారం రైతుబజారు ఈవో స్వప్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు కిలో కందిపప్పు రూ.120 చొప్పున ఒక్కొక్కరికి కిలో కందిపప్పును విక్రయించనున్నట్లు తెలిపారు.