రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం | one died by hitting train | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం

Apr 29 2017 12:21 AM | Updated on Sep 5 2017 9:55 AM

గుంటుపల్లె గ్రామానికి చెందిన కృష్ణయ్య(28) అనే వ్యక్తి శుక్రవారం రైలు ఢీకొని మ​​ృతి చెందాడు.

వెల్దుర్తి రూరల్‌ : గుంటుపల్లె గ్రామానికి చెందిన కృష్ణయ్య(28) అనే వ్యక్తి  శుక్రవారం రైలు ఢీకొని మ​​ృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడికి చెవుడు ఉంది. ఇతను రోజు రాయి కొట్టే పనులకెళ్తాడు.  ఎండలు ఎక్కువగా ఉన్నందున శుక్రవారం తెల్లవారుఝామునే పనికి వెళ్లాడు. ఈ క్రమంలో సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా  రైలు ఢీకొన్నట్లు అనుమానం. మృతుడికి భార్య కళావతి, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement