పుష్కరఘాట్లను పరిశీలించిన అధికారులు | Officers observed Pushkarni Ghat | Sakshi
Sakshi News home page

పుష్కరఘాట్లను పరిశీలించిన అధికారులు

Jul 20 2016 1:04 AM | Updated on Sep 4 2017 5:19 AM

: మండలకేంద్రంతోపాటు దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం సమీపంలో నిర్మిస్తున్న కృష్ణా పుష్కరఘాట్లను ఎండోమెంట్‌ డీసీ దుర్గాప్రసాద్‌ మంగళవారం పరిశీలించారు.

కనగల్‌ : మండలకేంద్రంతోపాటు దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం సమీపంలో నిర్మిస్తున్న కృష్ణా పుష్కరఘాట్లను ఎండోమెంట్‌ డీసీ దుర్గాప్రసాద్‌ మంగళవారం పరిశీలించారు. కనగల్‌ వాగు సమీపంలో నిర్మిసున్న శ్రీ తిరుమలనాథస్వామి ఆల యంతోపాటు దర్వేశిపురంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్‌ ఆలయ నిర్మాణం పనులను సైతం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల నేపథ్యంలో మండలంలోని రెండు చోట్ల రూ. 12 లక్షల ఎండోమెంట్‌ నిధులతో తిరుమలనాథస్వామి ఆలయంతోపాటు హనుమాన్‌ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు. సకాలంలో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ నర్సింగ్‌ శ్రీనివాస్‌గౌడ్, ఈఓలు అన్నెపర్తి సులోచన, రంగాచారి, జేఏ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement