పాఠశాలకు ఎన్నారైల వితరణ | NRI to adopt schools, donate notebooks | Sakshi
Sakshi News home page

పాఠశాలకు ఎన్నారైల వితరణ

Jun 25 2016 2:22 PM | Updated on Sep 15 2018 7:22 PM

ఆదిలాబాద్ జిల్లాగా దండేపల్లి మండలం రెబ్బనపల్లి ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు రూ.3 లక్షల విలువైన సామగ్రిని వితరణ చేశారు.

దండేపల్లి(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లాలో దండేపల్లి మండలం రెబ్బనపల్లి ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు రూ.3 లక్షల విలువైన సామగ్రిని వితరణ చేశారు. వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్, ఆసిని ఫౌండేషన్, ఎఫ్4 సంస్థలు ఈ పాఠశాలలను దత్తత తీసుకున్నాయి.

సంస్థల నిర్వాహకులు శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమలో 300 మంది పిల్లలకు నోట్‌బుక్కులు అందజేశారు. అంతేకాదు, విద్యార్థులు కూర్చునేందుకు అవసరమైన బెంచీలు తయారు చేయించి ఇచ్చారు. పాఠశాలలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement