ప్రతినెలా 15 లోపు భవిష్యనిధి చెల్లింపులు | Now, Provident fund payements every month 15 | Sakshi
Sakshi News home page

ప్రతినెలా 15 లోపు భవిష్యనిధి చెల్లింపులు

Jan 30 2016 7:29 PM | Updated on Sep 5 2018 8:20 PM

ఉద్యోగుల భవిష్యనిధి చెల్లింపులు ఇక నుంచి ప్రతినెలా 15వ తేదీలోపు కట్టాలని రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పి.వీరభద్రస్వామి తెలిపారు.

గుంటూరు: ఉద్యోగుల భవిష్యనిధి చెల్లింపులు ఇక నుంచి ప్రతినెలా 15వ తేదీలోపు కట్టాలని రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పి.వీరభద్రస్వామి తెలిపారు. ఈపీఎఫ్ చట్టం కింద వివిధ వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు చెందిన యజమానులు ప్రతినెలా 15వ తేదీలోపు చెల్లింపులు చేయాల్సివుంటే, పెనాల్టీలు లేకుండా మరో ఐదు రోజుల గడువుతో చెల్లింపులకు అవకాశం ఇచ్చామన్నారు.

ఫిబ్రవరి నుంచి ప్రతి నెలా 15 లోపు చెల్లింపులు జరపాలని, లేకుంటే ఆ మొత్తాలపై వడ్డీతోపాటు డామేజీలు కూడా ఉంటాయని తెలిపారు. ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వ్యాపార, పారిశ్రామిక సంస్థల యజమానులు చెల్లింపులు చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement