రాజన్న ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సన్నాహాలు | notification the new trusty | Sakshi
Sakshi News home page

రాజన్న ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సన్నాహాలు

Aug 24 2016 8:00 PM | Updated on Sep 4 2017 10:43 AM

రాజన్న ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సన్నాహాలు

రాజన్న ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సన్నాహాలు

వేములవాడ రాజన్న ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి దేవాదాయశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు చేపట్టాలని, ఆయా ఆలయాల నుంచి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, 20 రోజుల గడువులో దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు పనులు చేపట్టారు.

  • అందుబాటులో దరఖాస్తులు 
  • సెప్టెంబర్‌ 8 చివరి తేదీ 
  • వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి దేవాదాయశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు చేపట్టాలని, ఆయా ఆలయాల నుంచి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, 20 రోజుల గడువులో దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించింది. ఈమేరకు  ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు  పనులు చేపట్టారు. దీంతో వేములవాడ రాజన్న ధర్మకర్తల మండలి నియామకానికి ఈనెల 20న నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీని ప్రకారం 20 రోజుల వ్యవధిలో దరఖాస్తులు చేసుకోవాలి. ఈ లెక్కన వచ్చేనెల 8వ తేదీ వరకు దరఖాస్తులకు చివరి తేదీగా అధికారులు చెబుతున్నారు. దరఖాస్తులను వేములవాడ రాజన్న కార్యాలయం, కరీంనగర్‌ ఏసీ కార్యాలయం, వరంగల్‌ డీసీ కార్యాలయం, దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయం, సెక్రటేరియట్‌లలో అందుబాటులో ఉంచారు. వచ్చేనెల 8 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలయ కమిటీల్లో సభ్యత్వాలు పొందేవారంతా పూర్తి చేసిన దరఖాస్తులను కరీంనగర్‌ ఏసీ కార్యాలయం, వరంగల్‌ డీసీ కార్యాలయం, కమిషనర్‌ కార్యాలయం, సెక్రటేరియట్‌లలో సమర్పించవచ్చు. దరఖాస్తు పూర్తి చేసి గెజిటెడ్‌ ఆఫీసర్‌తో ధ్రువీకరించిన తర్వాతనే సమర్పించాల్సి ఉంటుంది.
     
     
     
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement