జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు అనిల్
సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు ఉత్తరప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన కీత అనిల్ ఎం పికయ్యాడు. ఈనెల 8 నుంచి 10 వరకు నల్గొం డలో స్టూడెంట్స్ ఒలంపిక్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అండర్–22 కేట గిరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి కి ఎంపికైనట్లు కోచ్ శ్రీధర్ తెలిపారు. అనిల్ హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు.