
కోడలిపై హత్యాయత్నం
ఆడపిల్లకు జన్మనివ్వబోతుందన్న కోపంతో కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన అత్త, ఆడ బిడ్డను ముత్తుకూరు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు
ఆయన రెండో సారి కూడా ఆడబిడ్డ పుడుతుందని చెప్పాడు. దీంతో ఎలాగైనా గిరిజను, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపి శ్రీనివాసులకు రెండో వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. గత నెల 18వ తేదీన శ్రీనివాసులు, ఆయన తండ్రి ఇంట్లో లేని సమయంలో లక్ష్మీకాంతమ్మ, సుభాషిణి కలిసి గిరిజపై సల్ఫ్యూరిక్యాసిడ్ కలిపిన కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. వారి నుంచి తప్పించుకున్న గిరిజ అదే రోజు ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం నిందితులు లక్ష్మీకాంతమ్మ, సుభాషిణి నెల్లూరు బారకాస్సెంటర్లో ఉండగా కృష్ణపట్నం పోర్టు సీఐ జి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముత్తుకూరు ఎస్ఐ బి. శ్రీనివాసరెడ్డి వారిని అరెస్ట్ చేశారు. జ్యోతిష్కుడు పరారీలో ఉన్నాడు. ఈ కేసులో మొదట నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బంది తీరుపై కూడా విచారణ చేపడుతున్నట్లు విలేకరులు అడిగిన ప్రశ్నకు డీఎస్పీ సమాధానం చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కృష్ణపట్నం పోర్టు సీఐ జి. శ్రీనివాసరావు, ముత్తుకూరు ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.