ఘటనపై రహస్యం పాటిస్తున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీ మద్దతుదారైన ఎమ్మెల్సీ అంగూరి శివకుమారి కుమారుడు ప్రవీణ్కుమార్ ఆదివారం అర్ధరాత్రి కాకినాడలో దూకుడుగా కారు నడిపి విద్యుత్ స్తంభాన్ని, రోడ్డు పక్కన నిలిపి ఉన్న రెండు కార్లను ఢీకొనడంతో పాటు రెండు ఆవుల మృతికి కారకుడయ్యూడు. కారు పల్టీ కొట్టడంతో అతడితో పాటు స్నేహితుడు సుధీర్ గాయపడ్డాడు. వారిద్దరినీ కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఘటన సమయంలో ప్రవీణ్కుమార్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రవీణ్కుమార్ జగన్నాథపురం వంతెన వైపు నుంచి వార్ఫురోడ్డులో పాతబస్టాండ్ వైపు వేగంగా కారు నడుపుతూ వచ్చాడు. అక్కడ పోలీసులు ఆపినా ఆగలేదు. కొద్ది దూరం వెళ్లాక కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న రెండు ఆవులను ఢీకొట్టింది. తర్వాత విద్యుత్తు స్తంభాన్ని, నిలిపి ఉన్న రెండు కార్లను ఢీకొని పల్టీకొట్టింది. ఓ కారు యజమాని ఆంజనేయస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.
‘మత్తు’లో ఎమ్మెల్సీ తనయుడి దూకుడు
Published Tue, Feb 16 2016 2:22 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement