మైనార్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు మైనార్టీ కార్పొరేషన్ ఈడీ మహ్మద్ అంజాద్ అలీ తెలిపారు.
మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్పు గడువు పొడిగింపు
Sep 7 2016 1:04 AM | Updated on Sep 15 2018 4:12 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : మైనార్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు మైనార్టీ కార్పొరేషన్ ఈడీ మహ్మద్ అంజాద్ అలీ తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పది, ఇంటర్ విద్యార్థుల నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్పుల కోసం దరఖాస్తులు కోరామన్నారు. అయితే చాలా మంది విద్యార్థుల విన్నపం మేరకు మరో నెలపాటు గడువు పొడిగించినట్లు వివరించారు.
Advertisement


