ముద్రగడ దీక్ష విరమించాలి: నారాయణ | Minister Narayana seeks to call off mudragada's indefinite hunger strike | Sakshi
Sakshi News home page

ముద్రగడ దీక్ష విరమించాలి: నారాయణ

Feb 6 2016 7:13 PM | Updated on Jul 30 2018 7:57 PM

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ కోరారు.

విజయవాడ: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ  కోరారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ లోగా కమిషన్ నివేదిక వస్తుందని నారాయణ తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ ముద్రగడ  ఆమరణ నిరహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.

ఆయన చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ముద్రగడ దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రిలే దీక్షలు, ఆందోళనలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement