అల్లుడే మా అమ్మాయిని చంపేశాడు... | married woman died suspiciously in vijayawada | Sakshi
Sakshi News home page

అల్లుడే మా అమ్మాయిని చంపేశాడు...

Feb 28 2016 6:08 PM | Updated on Sep 3 2017 6:37 PM

ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన విజయవాడలోని చిట్టినగర్ వద్ద వెలుగు చూసింది.

విజయవాడ: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన విజయవాడలోని చిట్టినగర్ వద్ద వెలుగు చూసింది. బందరుకు చెందిన బత్తిని చందన(31)కు చిట్టిగారి పార్కు సమీపంలో నివాసముంటున్న వీరబాబుతో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. ఈ క్రమంలో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి, తాజాగా శనివారం తగువు పెట్టుకొని.. పిల్లలను వెంట పెట్టుకొని వీరబాబు బందరు వెళ్లి పోయాడు.

అనంతరం తల్లిదండ్రులు వచ్చి చూడగా చందన ఉరి వేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అల్లుడు వీరబాబు తన కూతురిని హత్యచేసి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించాడని చందన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement