98 వాహనాలు దహనం చేసిన మావోలు | Maoists have burned 98 vehicles | Sakshi
Sakshi News home page

98 వాహనాలు దహనం చేసిన మావోలు

Dec 24 2016 1:02 AM | Updated on Oct 9 2018 2:53 PM

98 వాహనాలు దహనం చేసిన మావోలు - Sakshi

98 వాహనాలు దహనం చేసిన మావోలు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆను కొని ఉన్న ప్రాణహిత నదికి అవతలి వైపున మహా రాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా

ఇద్దరు డ్రైవర్ల హత్య? మహారాష్ట్రలో ఘటన

కాగజ్‌నగర్‌ రూరల్‌: కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆను కొని ఉన్న ప్రాణహిత నదికి అవతలి వైపున మహా రాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా ఏటాపల్లి తాలుకాలోని సుర్జా గఢ్‌æ గుట్ట సమీపంలో శుక్రవారం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ లకు చెందిన సుమారు 800 మంది సాయుధ మావోయి స్టులు సుమారు 98 వాహనాలను దహనం చేసినట్లు తెలిసింది.

గుట్ట లోయలో  లోహం తయారయ్యే రాయిని రెండు మాసాల నుంచి చంద్రపూర్‌ గఢ్‌చందూర్‌ సమీపంలోని ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. రాయి లభించే చోటనే మిల్లును ఏర్పాటు చేయాలని మావోలుS లోగడ పలుమార్లు డిమాండ్‌ చేసినా ఖాతరు చేయకుండా  సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని గఢ్‌ చందూర్‌ ఫ్యాక్టరీకి రాయిని తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో 18 జేసీబీలు, 80 ట్రక్కు లను కాల్చివేశారని, 300 మంది సిబ్బందిని చితకబా దారని, ఇద్దరు డ్రైవర్లను హత్య చేశారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement