కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య | man suicide with family disputes | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Jan 30 2016 5:34 PM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మాగనూరు: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలం కొల్టూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శంకరప్ప(45) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement