మాట్లాడుతున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు రవి
జడ్చర్ల : సాగునీటి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర ఒప్పందాలతో తెలంగాణకు తీరని నష్టం ఏర్పడుతుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. సోమవారం జడ్చర్ల మండలం కావేరమ్మపేట ఎంబీ మెడికల్ సెంటర్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.
జడ్చర్ల : సాగునీటి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర ఒప్పందాలతో తెలంగాణకు తీరని నష్టం ఏర్పడుతుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. సోమవారం జడ్చర్ల మండలం కావేరమ్మపేట ఎంబీ మెడికల్ సెంటర్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల, దేవాదుల ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిందీ తామేనన్నారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టాల్లో కూరుకుపోయారని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, బ్లాక్కాంగ్రెస్ అధ్యక్షు డు అశోక్యాదవ్, మార్కెట్ కమిటీæమాజీ వైస్చైర్మెన్ మాలిక్ షాకీర్ పాల్గొన్నారు.