లారీ బోల్తా క్లీనర్‌ మృతి | lorry rolls and cleaner dies | Sakshi
Sakshi News home page

లారీ బోల్తా క్లీనర్‌ మృతి

Mar 9 2017 12:08 AM | Updated on Sep 5 2017 5:33 AM

యాడికి మండలం వేములపాడు వద్ద బుధవారం తెల్లవారుజామున లారీ బోల్తా పడి క్లీనర్‌ మరణించగా, డ్రైవర్‌ గాయపడినట్లు ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.

యాడికి (తాడిపత్రి టౌన్‌) :  యాడికి మండలం వేములపాడు వద్ద బుధవారం తెల్లవారుజామున లారీ బోల్తా పడి క్లీనర్‌ మరణించగా, డ్రైవర్‌ గాయపడినట్లు ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. కర్ణాటక నుంచి సిమెంట్‌ లోడుతో చెన్నై బయలుదేరిన లారీ మార్గమధ్యంలోని వేములపాడు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన క్లీనర్‌ విశాల్‌(20) అక్కడికక్కడే మరణించినట్లు వివరించారు. డ్రైవర్‌ కూడా తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement