breaking news
	
		
	
  vemulapadu
- 
      
                    
లారీ బోల్తా క్లీనర్ మృతి

 యాడికి (తాడిపత్రి టౌన్) : యాడికి మండలం వేములపాడు వద్ద బుధవారం తెల్లవారుజామున లారీ బోల్తా పడి క్లీనర్ మరణించగా, డ్రైవర్ గాయపడినట్లు ఎస్ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. కర్ణాటక నుంచి సిమెంట్ లోడుతో చెన్నై బయలుదేరిన లారీ మార్గమధ్యంలోని వేములపాడు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్లీనర్ విశాల్(20) అక్కడికక్కడే మరణించినట్లు వివరించారు. డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. - 
      
                    
దొంగ అరెస్ట్

 యాడికి : మండలంలోని వేములపాడు గ్రామంలో సోమవారం రాత్రి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లిన రామాంజనేయులు అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. వివరాలు.. సోమవారం అర్ధరాత్రి అతడు వేములపాడులోని ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లి బీరువాను పగులగొట్టేందుకు యత్నించాడు. 
 
 ఇంటి యజమానులు గమనించి పట్టుకోబోగా అతడు పారిపోయాడు. వారి ఫిర్యాదు మేరకు మంగళవారం అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 


