దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో టపాకాయల విక్రయానికి లైసెన్స్ పొందేందుకు ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు డీఆర్ఓ హేమసాగర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అనంతపురం అర్బన్: దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో టపాకాయల విక్రయానికి లైసెన్స్ పొందేందుకు ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు డీఆర్ఓ హేమసాగర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేవారు నాలుగు కాపీలు ఫారం ఏఈ–5, ఐదు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, నివాస ధ్రువీకరణ పత్రాలతో రూ.500 చలానా జతచేసి 30వ తేదీలోగా కలెక్టర్ కార్యాలయంలో అందజేయాలన్నారు.