నేడు ముద్రగడతో కాపు జేఏసీ నేతల భేటీ | kapu jac leaders meets with mudragada in kirlampudi | Sakshi
Sakshi News home page

నేడు ముద్రగడతో కాపు జేఏసీ నేతల భేటీ

Jun 23 2016 11:29 AM | Updated on Jul 30 2018 6:21 PM

నేడు ముద్రగడతో కాపు జేఏసీ నేతల భేటీ - Sakshi

నేడు ముద్రగడతో కాపు జేఏసీ నేతల భేటీ

కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంతో గురువారం కాపు జేఏసీ నేతలు సమావేశం కానున్నారు.

కిర్లంపూడి: కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంతో కాపు జేఏసీ నేతలు గురువారం సమావేశం కానున్నారు. ముద్రగడ నివాసంలో జరిగే ఈ సమావేశంలో నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. తుని ఘటనలో కేసులు, కాపు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధింపులకు గురిచేసినా ఉద్యమం నుంచి వెనకడుగు వేయబోనని, ప్రాణం ఉన్నంత వరకూ ఉద్యమిస్తానని 14 రోజుల దీక్ష విరమించిన అనంతరం బుధవారం ముద్రగడ స్పష్టం చేశారు. తనపై, తన కుటుంబంపై ప్రభుత్వం కక్షకట్టి వేధింపులకు గురిచేసిందని, తనను ప్రపంచ ఉగ్రవాదిలా చిత్రీకరించిందని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement