ఐటీఐలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | ITI college admission | Sakshi
Sakshi News home page

ఐటీఐలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Sep 15 2016 1:03 AM | Updated on Aug 17 2018 3:08 PM

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ బాలికల ఐటీఐ కన్వీనర్‌ కె.వేమారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

 మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ బాలికల ఐటీఐ కన్వీనర్‌ కె.వేమారెడ్డి   ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మూడో విడత ప్రవేశం కోసం అభ్యర్థులు ఏ కాలేజీలో అయితే ప్రవేశం పొందాలనుకుంటున్నారో ఆ కాలేజీలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐలలో ఈనెల 22న, ప్రైవేటు ఐటీఐలలో ఈనెల 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్‌ ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని కోరారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement